యాప్నగరం

నాథూరాం గాడ్సేపై ఏపీ బీజేపీ కార్యదర్శి సంచలన ట్వీట్.. గంటల్లోనే ట్విస్ట్!

BJP: నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ ఏపీ బీజేపీ కార్యదర్శి చేసిన ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది.

Samayam Telugu 16 Nov 2020, 3:17 pm
మహాత్మా గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేని పొగుడుతూ ఏపీ బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు చేసిన ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది. గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణిస్తూ చేసిన ట్వీట్ నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ ట్వీట్‌ను రమేష్‌ నాయుడు తొలగించారు. అలాగే ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. తన ట్విట్టర్ హ్యాండిల్ చేస్తోంది తాను కాదని, ఎవరైతే ఈ ట్వీట్ చేశారో వారిని తొలగించినట్లు మరో ట్వీట్ చేశారు.
Samayam Telugu గాంధీ, గాడ్సే


అసలేం జరిగిందంటే.. నవంబరు 15న గాడ్సే వర్ధంతి సందర్భంగా.. ‘‘నేడు నాథూరాం గాడ్సే వర్ధంతి. ఈ సందర్భంగా గాడ్సేకు సెల్యూట్ చేస్తున్నా. అలాగే ఆయన పట్ల సంపూర్ణ కృతజ్ఞతాభావం చాటుకుంటున్నా. భరతభూమిలో ఇంతటి గొప్ప దేశభక్తుడు ఇక జన్మించబోడు’’ అని రమేష్ నాయుడు ట్విట్టర్ హ్యాండిల్‌ నుంచి ట్వీట్ వెలువడింది. అయితే కొద్ది సేపట్లోనే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మహాత్ముడిని చంపిన గాడ్సే అంత గొప్ప దేశభక్తుడైతే.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీజీ దేశద్రోహా? అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
ఈ ట్వీట్ సోషల్‌ మీడియాలో తీవ్ర వివాదాస్పదం కావడంతో రమేష్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఈ ట్వీట్ తాను చేయలేదని వివరణ ఇచ్చారు. ‘‘నా నా ట్విట్టర్‌ను హ్యాండిల్ చేస్తున్న వారు అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టారు. దానిని, వారి సేవలను తొలగించడమైనది’’ అని రమేష్ నాయుడు వివరణ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.