యాప్నగరం

'ఆ పథకాలకు జగన్ సర్కార్ స్టిక్కర్లు'.. ఈయన తిట్లు, ఆయన పొగడ్తలు

Ysr Rythu Bharosa Scheme| ఆయనేమో జగన్ నిర్ణయాన్ని స్వాగతించామని చెబుతారు.. ఈయనేమో మా పథకాలకు మీరు స్టిక్కర్లు అంటించకున్నారని విమర్శలు చేస్తారు. ఇదేం ట్విస్టో మరి.

Samayam Telugu 21 Oct 2019, 3:42 pm
కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటున్నాయని విమర్శించారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి కేంద్ర పథకాల స్టిక్కర్లు మార్చి తాము చేసినట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతు భరోసా పథకానికి సంబంధించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. సీఎం జగన్.. కేంద్రం ఇచ్చిన రూ.6వేలతో కలిపి రూ.18,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ స్టిక్కర్‌ స్కీమ్‌లకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు విష్ణు.
Samayam Telugu cm.


ఇదిలా ఉంటే రైతు భరోసాకు సంబంధించి జగన్ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సానుకూలంగా స్పందిస్తే.. విష్ణువర్థన్ రెడ్డి మాత్రం విమర్శించారు. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి జగన్ సర్కార్ రైతులకు రూ.`13,500 అందిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఉండటంతో.. ప్రధాని పేరును కూడా చేర్చాలని కన్నా డిమాండ్ చేశారు. సీఎం జగన్ కూడా అలాగే రైతు భరోసా పేరులో పీఎం కిసాన్‌గా మార్చారు. దీనిపై స్పందించిన కన్నా.. జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.

కన్నా తన ట్వీట్‌లో ‘మోదీ గారు రైతులకు అందించే కేంద్ర నిధులు రూ.6000 కు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి "YSR రైతు భరోసా-PM కిసాన్"గా ఇవ్వడం హర్షణీయం.. గత సర్కారులా కాక ఇకపై కేంద్రం నిధులతో ఇచ్చే వివిధ సంక్షేమ పథకాలకు ప్రధానమంత్రి పేరు తప్పనిసరిగా జత చేసి లబ్ధిదారులకు అందచేయాలి’అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.