యాప్నగరం

విష్ణుపై దాడి ఘటన.. డీజీపీ ఆఫీసులో బీజేపీ నేతల ఫిర్యాదు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

Vishnuvardhan Reddyపై న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్‌లో దాడి జరగడాన్ని ఏపీ బీజేపీ నేతలు ఖండించారు. సోము వీర్రాజు ఆదేశాల మేరకు డీజీపీ ఆఫీసుకెళ్లి ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 25 Feb 2021, 10:50 pm
బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై ఓ న్యూస్ ఛానెల్ డిబేట్‌లో అమరావతి పరిరక్షణ జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాల మేరకు బీజేపీ నాయకుల బృందం డీజీపీ ఆఫీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యనార్‌ కలిసి ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు.
Samayam Telugu ap bjp leaders at dgp office


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే తనపై దాడి జరిగిందని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ‘అధికారం కోసం నాడు వైశ్రాయ్ హోటల్ లో తెలుగు జాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్‌పై చంద్రబాబు జరిపిన దుశ్చర్య కాండ పరంపర నిన్నటి ఏబీఎన్ చర్చా కార్యక్రమం వరకు మీ కుట్రకోణం కొనసాగుతూనే ఉంది. భౌతిక దాడులతో బీజేపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తామనుకోవడం మీ మూర్ఖపు ఆలోచన’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి విష్ణు ట్వీట్ చేశారు.

కాగా ఈ ఘటనపై వైసీపీ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న న్యూస్ ఛానెల్ స్టూడియోలో కొడితే... ఆంధ్రా డీజీపీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్ ప్రకారమే సోము వీర్రాజు యాక్షన్ ఉందంటున్నారు. తెలంగాణలో దాడి జరిగితే జగన్ సర్కారు ఏం చేస్తుందని..? ఇది జగన్‌ను ఇబ్బంది పెట్టడం కోసం కాదా? అని ప్రశ్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.