యాప్నగరం

బీజేపీతో వైసీపీ దోస్తీపై ప్రచారం.. కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోదీ, సీఎం జగన్ భేటీతో కొత్త ప్రచారం. బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీ చేస్తోందంటూ ఊహాగానాలు.. స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఆసక్తికర వ్యాఖ్యలు.

Samayam Telugu 15 Feb 2020, 2:33 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో వరుసగా భేటీకావడంతో.. బీజేపీ-వైఎస్సార్‌సీపీల మధ్య దోస్తీ కుదిరిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ ప్రచారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ap bjp president kanna lakshminarayana interesting comments on pm modi and cm jagan meet
బీజేపీతో వైసీపీ దోస్తీపై ప్రచారం.. కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు


Read Also: వైసీపీతో మాకు దోస్తీ ఏంటి?.. ఏపీ బీజేపీ ఇంఛార్జ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్సార్‌సీపీ ఎన్డీఏలో చేరడంపై తమకు సమాచారం లేదన్నారు కన్నా. టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు సమాన దూరంలో ఉండాలన్నదే తమ పార్టీ విధానమని.. ఈ అంశంపై ఇప్పటికే తమ పార్టీ ఇంఛార్జ్‌లు ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఎన్టీఏ చేరిక విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎందుకలా మాట్లాడారో తనకు తెలియదన్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ పరిపాలనా పరమైన అంశాలపై మాత్రమే ప్రధానితో, కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించి ఉంటారన్నారు. ఈ వరుస భేటీలకు రాజకీయాలకు సంబంధం లేదని అభిప్రాయపడ్డారు.

Also Read: జగన్ సాయం కోరిన ప్రధాని మోదీ?.. ఆ ఒక్కటీ అడిగారట!

ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని.. అక్రమంగా కేసులు పెట్టారని కన్నా మండిపడ్డారు. కడప జిల్లాలో ఇసుక దందాను అడ్డుకున్నందుకు బీజేపీ నేతలపై దాడి చేసి.. తిరిగి వారిపైనే కేసులు పెట్టారన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఇంత దారుణమైన పరిస్థితిని రాష్ట్రంలో చూడలేదు అంటున్నారు కన్నా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.