ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన కమలనాథులు.. వైఎస్సార్సీపీ సర్కార్ను టార్గెట్ చేస్తున్నారు. రాజధాని తరలింపు వివాదం, వరదల వ్యవహారం.. ఇలా ప్రతి అంశంపై స్పందిస్తోంది. అమరావతి రైతులకు అండగా నిలుస్తూ.. ఏకంగా గవర్నర్ను కలిసి రాజధాని వ్యవహారంపై జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. Read Also: మంత్రి పదవికి రాజీనామా చేస్తారా.. బొత్సకు చింతమనేని సవాల్
ఇక వరదల వ్యవహారంపై తాజాగా జగన్ సర్కార్ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టార్గెట్ చేశారు. వరదల్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని మండిపడుతూ ట్వీట్ చేశారు. ‘పోతూ పోతూ బాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడు.. వచ్చి జగన్ వరదల్లో ముంచుతున్నారు.ఫ్లడ్ మ్యానేజ్మెంట్ చేత కాక పోతే నిపుణులకు తెలిపి సహాయం తీసుకోండి కానీ ప్రజలను ఇక్కట్ల పాలు చేయకండి. తక్షణమే వరద విషయంలో చర్యలు తీసుకుని ముంపు సమస్యతో పాటు రోగాలు ప్రభలకుండా జాగ్రత్తలు చేపట్టండి’అన్నారు.
రాజధాని విషయంలోనూ కన్నా ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బు చెల్లించలేదని.. వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం కౌలును చెల్లించడంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అంశంపైనా క్లారిటీ ఇవ్వాలని కోరారు. తాజాగా మళ్లీ వరదలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
ఇక వరదల వ్యవహారంపై తాజాగా జగన్ సర్కార్ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టార్గెట్ చేశారు. వరదల్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని మండిపడుతూ ట్వీట్ చేశారు. ‘పోతూ పోతూ బాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడు.. వచ్చి జగన్ వరదల్లో ముంచుతున్నారు.ఫ్లడ్ మ్యానేజ్మెంట్ చేత కాక పోతే నిపుణులకు తెలిపి సహాయం తీసుకోండి కానీ ప్రజలను ఇక్కట్ల పాలు చేయకండి. తక్షణమే వరద విషయంలో చర్యలు తీసుకుని ముంపు సమస్యతో పాటు రోగాలు ప్రభలకుండా జాగ్రత్తలు చేపట్టండి’అన్నారు.