యాప్నగరం

Pawan Kalyan‌తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ

కొత్తగా బీజేపీ పగ్గాలు చేపట్టిన సోమును పవన్ అభినందించారు.. శాలువాతో సన్మానించారు. బీజేపీ- జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగాలని.. ప్రజా సమస్యలపై పోరాడాలని నిశ్చయించారు.

Samayam Telugu 7 Aug 2020, 12:37 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. ఈ ఇద్దరు నేతలు పవన్ ఇంట్లో సమావేశమయ్యారు. వీర్రాజు మర్యాదపూర్వకంగానే జనసేనానిని కలిశారు. కొత్తగా బీజేపీ పగ్గాలు చేపట్టిన సోమును పవన్ అభినందించారు.. శాలువాతో సన్మానించారు. బీజేపీ- జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగాలని.. ప్రజా సమస్యలపై పోరాడాలని నిశ్చయించారు.
Samayam Telugu పవన్, వీర్రాజు


మరోవవైపు సోము వీర్రాజు మెగాస్టార్ చిరంజీవిలు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు. చిరంజీవి పూలమాల, శాలువాతో సత్కరించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యలో పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. 2024లో ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని ఆకాంక్షించారు.

సోము వీర్రాజును బీజేపీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో ఏపీ అధ్యక్షుడిగా నియమించింది. ఆయన కూడా ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల్ని కలిసి వచ్చారు. 2024 ఎన్నికలు లక్ష్యంగా పనిచేస్తానని.. పార్టీని బలోపేతం చేస్తానని సోము అన్నారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రముఖుల్ని కలుస్తున్నారు.. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని, జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.