యాప్నగరం

నంద్యాల సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

సలాం ఫ్యామిలీ ఆత్మహత్య ఘటనలో పోలీసుల్ని అరెస్ట్ చేయడం సరికాదని.. డ్యూటీ చేసిన పోలీసుల్ని అరెస్ట్ చేయడం ఏంటని .. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎంని అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు.

Samayam Telugu 16 Nov 2020, 11:47 am
ఏపీలో సంచలనం రేపిన సలాం కుటుంబం ఆత్మహత్యపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో పోలీసుల్ని అరెస్ట్ చేయడం సరికాదని.. డ్యూటీ చేసిన పోలీసుల్ని అరెస్ట్ చేయడం ఏంటని .. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎంని అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. నంద్యాల ఘటనను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని.. వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు ముస్లిం ఓట్లే ముఖ్యమా అని ప్రశ్నించారు. జగన్, చంద్రబాబు చేసేవి మతతత్వ రాజకీయాలు కావా.. హిందూ మతానికి అన్యాయం జరిగిందని.. తాము అడిగితే మతతత్వ రాజకీయాలు చేశామంటున్నారని మండిపడ్డారు. ముస్లింలే మనుషులా.. మిగిలిన వాళ్లు మనుషులు కారా అంటూ ప్రశ్నించారు వీర్రాజు. ముస్లింల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదని.. టీటీడీలో అక్రమాలను ప్రశ్నిస్తే తమపై హిందుత్వ ముద్ర వేస్తున్నారన్నారు.
Samayam Telugu సోము వీర్రాజు


రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణా దారుణంగా జరుతోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. స్మగ్లింగ్‌కు ప్రభుత్వం సహకరిస్తుందా.. వెంటనే స్మగ్లింగ్‌ను అరికట్టాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్య పథకానికి నిధులివ్వడం లేదని.. పోలవరం నిర్మాణంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముంపు మండలాలపై టీడీపీ, వైసీపీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నంద్యాల సలాం కుటుంబం ఆత్మహత్య వ్యవహారం సంచలనం రేపుతున్న సమయంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.