యాప్నగరం

వైసీపీ నేతల భూకుంభకోణం.. సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ

విశాఖపట్నం దసపల్లా భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. దీని వెనుక అధికార వైసీపీ నేతల భూ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 4 Oct 2022, 10:18 pm
విశాఖపట్నంలో దసపల్లా భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ ఆరోపించారు. దసపల్లా భూములను బిల్డర్లకు అప్పగించడానికి రంగం సిద్ధమైందని, దీని వెనుక అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భూ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోము వీర్రాజు మంగళవారం లేఖ రాశారు. దసపల్లా భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చూడాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడాలన్నారు.
Samayam Telugu సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ


కాగా, దసపల్లా భూముల్లో బహుళ అంతస్తుల నిర్మాణానికి సంబంధించి కుదుర్చుకున్న అగ్రిమెంట్లతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లు వెలుగులోకి రావడంతో అలజడి మొదలైంది. ఈ వ్యవహారంలో వైసీపీలోని ప్రముఖ వ్యక్తి కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ. 3 వేల కోట్ల విలువైన దసపల్లా భూముల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

అధికార వైసీపీపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ సైతం అధికార వైసీపీని టార్గెట్ చేసింది. ఈ క్రమంలో ఈ భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోము వీర్రాజు లేఖ రాశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.