యాప్నగరం

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్: 6 రకాల ఫీజులు రద్దు.. ఆ డబ్బులు కట్టక్కర్లేదు!

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 14 Dec 2020, 11:23 pm
కరోనా వైరస్ మహమ్మారి పగపట్టిన కష్టకాలంలో జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారికి పెద్ద ఊరట కల్పించింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి వివిధ ఫీజులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu జగనన్న వసతి దీవెన


ఈ మేరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ వి.రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత కాలేజీల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పారు. ఫీజుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని స్పష్టం చేశారు.

రద్దు చేసింది ఈ ఫీజులనే..
రీ అడ్మిషన్స్ ఫీజు: రూ.1,000
టీసీ అడ్మిషన్స్: రూ.1,000
సెకండ్ లాంగ్వేజ్ మార్చుకునే ఫీజు: రూ.800, ఫస్ట్ ఇయర్ మాత్రమే
మీడియం మార్చుకోవడానికి ఫీజు: రూ.600, ఫస్ట్ ఇయర్ మాత్రమే
గ్రూప్ మార్చుకోవడానికి ఫీజు: రూ. 1,000, ఫస్ట్ ఇయర్ మాత్రమే
ఛేంజ్ ఆఫ్ గ్రూప్: రూ.1,000, సెకండ్ ఇయర్ కోసం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.