యాప్నగరం

ఏపీలో మూడు కొత్త జిల్లాలు.. కేబినెట్ అనూహ్య నిర్ణయం!?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సమాచారం. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Samayam Telugu 28 Jan 2020, 8:12 pm
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 13 జిల్లాలను లోక్ సభ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలకు పెంచుతారనే టాక్ వినిపిస్తోంది. కాగా.. కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించిందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మచిలీపట్నం కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు సమీపంలో ఉండే గుంటూరు జిల్లాలోని గురజాల ప్రాంతాన్ని కూడా జిల్లా చేసినట్టు వార్తలొస్తున్నాయి.
Samayam Telugu ap  map


రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మచిలీపట్నం, అరకు, గురజాలల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుంది. వైద్య వసతులు తక్కువగా ఉండి వెనుకబాటుకు గురై, మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే.. అందుకయ్యే వ్యయంలో 60 శాతం వరకు నిధులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) సమకూర్చే అవకాశం ఉంది.

ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడం కోసమే మచిలీపట్నం, అరకు, గురజాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మూడు జిల్లాల ఏర్పాటుతోపాటు మిగతా కొత్త జిల్లాలను కూడా దశలవారీగా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

Read Also: ‘జగన్‌కు అమిత్ షాతో సత్సంబంధాలు.. వైఎస్ మరణించినప్పుడూ ఇంతే’

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూస్తే.. నర్సరావుపేట జిల్లా కావాల్సింది. కానీ నియోజకవర్గం పరిధిలోని గురజాలను జిల్లా చేయడంతో.. దాన్నే జిల్లా కొనసాగించే అవకాశం ఉంది.

Read Also: ఓటింగ్‌కు 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు దూరం.. ‘అనారోగ్య’ కారణాలే అధికం

Read Also: వివేకా మర్డర్ కేసు.. జగన్‌కు షాకిచ్చిన సోదరి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.