యాప్నగరం

ఏపీలో పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు లబ్ది

రాష్ట్రంలో 1.50 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయనుంది. ముఖ్యంగా పేదల కోసం ఈ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.

Samayam Telugu 20 Aug 2020, 8:33 am
జగన్ సర్కార్ సంక్షేమంలో దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు లబ్ది చేకూరేలా కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తాజాగా పేదల కోసం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. బియ్యం కార్డు ఉండి కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేయనుంది. ముఖ్యంగా పేదల కోసం ఈ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
Samayam Telugu సీఎం జగన్


Read Also: అనంతపురం: మంచంపై పెళ్లి.. కాళ్లు విరగొట్టిన వాళ్లే ఘనంగా చేశారు

గతంలో ఎల్‌ఐసీతో కలసి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేది. కానీ దీనిని కొద్ది రోజుల క్రితం ఉపసంహరించుకుంది. అయితే పేదల కోసం ఈ పథకాన్ని పూర్తిగా సొంత నిధులతో అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో 1.50 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయనుంది. బియ్యం కార్డుదారుల కుటుంబం ఆధారపడే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు బీమా పరిహారం ఇస్తారు. శాశ్వత వైకల్యం, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారు. 51 – 70 ఏళ్ల వ్యక్తి శాశ్వత వైకల్యం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు అందుతాయి.

Also Read: ఏపీ: ఆ నాలుగు జిల్లాల్లో జనాలకు కరోనా వచ్చినా తెలియలేదట.. ఆసక్తికర సర్వే, షాకింగ్ విషయాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.