యాప్నగరం

చినజీయర్ ట్రస్టుకు విజయవాడలో 40 ఎకరాలు.. ఏపీ కేబినెట్ నిర్ణయం

శాసన మండలి రద్దుకు తీర్మానం చేసిన ఏపీ కేబినెట్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. చినజీయర్ ట్రస్టుకు 40 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.

Samayam Telugu 27 Jan 2020, 12:07 pm
సోమవారం ఉదయం సమావేశమైన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పలు బిల్లులకు అడ్డుతగులుతున్న శాసన మండలి రద్దు సరైందేనని మంత్రివర్గం అభిప్రాయపడింది. అందరి చూపు ఈ నిర్ణయంపై ఉండగా.. కేబినెట్ మరి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. కడప ఆర్‌అండ్‌బీ ఆఫీసు ఆవరణలోని టీడీపీ కార్యాలయం తొలగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా విజయవాడలో చినజీయర్‌ ట్రస్ట్‌కు 40 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
Samayam Telugu jagan china jeeyar


యాదగిరిగుట్ట జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీని ఏర్పాటు చేయడం కోసం కేసీఆర్ సర్కారు చినజీయర్ స్వామికి గతంలో 2 ఎకరాల 30 గుంటల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం గుండ్లపల్లిలోని సర్వే నెం.172లోని భూమిని ఎకరానికి రూ.6 లక్షల చొప్పున రూ.16.50 లక్షలకు యాదాద్రి టెంపుల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ(వైటీడీఏ) విక్రయించింది. ఈ భూమిని చినజీయర్‌ స్వామి ప్రతినిధి పేరిట వైటీడీఏ 2019 సెప్టెంబర్ 5న రిజిస్ట్రేషన్‌ చేశారు. వైటీడీఏ పరిధిలో ఎకరా భూమి రూ.10 కోట్ల దాకా పలుకుతుండగా.. తెలంగాణ సర్కారు తక్కువ ధరకే భూమిని కేటాయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.