యాప్నగరం

AP Cabinet Meet: ఏపీ ప్రజలకు సీఎం జగన్ వరాలు: వారందరికీ డబ్బులు.. కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు

Kurasala Kannababu: ఏపీ కేబినెట్ సమావేశ నిర్ణయాలను మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వెల్లడించారు.

Samayam Telugu 27 Nov 2020, 4:10 pm
ఆంధ్రప్రదేశ్‌ను నివర్ తుఫాను ముంచెత్తుతున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. 27 అంశాలతో ఈ కేబినేట్ సమావేశం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు. నివర్ తుఫాను కారణంగా రాష్ట్రంలో 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు.. 13 వందల హెక్టర్లలో ఉద్యానవన పంటలు నష్టపోయినట్టుగా సమాచారం ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన తుఫాను సహాయక చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని కన్నబాబు వెల్లడించారు.
Samayam Telugu సీఎం జగన్
YS Jagan


తుఫాను ప్రభావంతో నిరాశ్రయులై శిబిరాల్లో తలదాచుకుంటున్నాని, వాళ్లందరికీ చిన్నా, పెద్దా అనే బేధం లేకుండా రూ. 500 చొప్పున సాయం అందజేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని కన్నబాబు వెల్లడించారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు డిసెంబర్ నెలాఖరుకల్లా పరిహారం ఇవ్వాలని చెప్పారన్నారు.

పోలవరం ప్రాజక్టు ఎత్తు తగ్గినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని, ఒక్క సెంటీ మీటర్ ఎత్తు కూడా తగ్గించడం లేదని కన్నబాబు స్పష్టం చేశారు. వర్షాలు, వరదల వల్ల నెల్లూరు జిల్లాలో ముగ్గురు చనిపోయినట్టు సమాచారం ఉందని కన్నబాబు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. 2018 జూలై 1 నుంచి ఇవ్వాల్సిన బకాయిలు కూడా చెల్లించలేదని, వీటన్నింటినీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం 30 నెలల బకాయిలను 3,017.40 లక్షలు చెల్లిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.