యాప్నగరం

AP Local Body Election: మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించనున్నారు.

Samayam Telugu 12 Feb 2020, 2:42 pm
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారానికి 5 రోజులు మాత్రమే గడువు ఉంటుండగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 8 రోజుల గడువు ఉంటుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
Samayam Telugu ap cabinet


డబ్బు, మద్యం ప్రభావం లేకుండా ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించినట్టు మంత్రి పేర్నినాని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డబ్బు, మద్యంతో అభ్యర్థులు పట్టుబడితే మూడేళ్ల శిక్ష విధించడంతోపాటు పోటీకి అనర్హులవుతారని హెచ్చరించారు. సర్పంచ్‌లు స్థానికంగా నివాసం ఉండేలా నిబంధనలు తీసుకొచ్చారు. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత సర్పంచ్‌లదేనన్నారు.

ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కార్పొరేషన్, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ లిమిటెడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఈ కేబినెట్ భేటీ గురువారం జరగాల్సింది. కానీ దాన్ని బుధవారానికి మార్చారు.

బుధవారం ఉదయం ఈ కేబినెట్ భేటీ ముగియగానే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. నేటి (బుధవారం) సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.