యాప్నగరం

అక్టోబర్‌ 1న ఏపీ కేబినెట్‌ భేటీ.. చర్చించే అంశాలివే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Samayam Telugu 28 Sep 2020, 8:57 am
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అక్టోబర్ 1న సమావేశంకానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పథకాలతో పాటూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే సీఎస్ కేబినెట్ భేటీకి సంబంధించి అధికారులకు శాఖలవారీగా ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు నెల రోజుల తర్వాత ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
Samayam Telugu ఏపీ కేబినెట్


ఈ నెల సెప్టెంబర్‌ 3న నిర్వహించిన మంత్రివర్గం సమావేశంలో ‘ఉచిత విద్యుత్‌– నగదు బదిలీ’ అంశంపై చర్చ జరిగింది. ఆన్‌లైన్ గేమ్స్ రమ్మీ, బెట్టింగ్‌లపై నిషేధం, రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి, ఏపీఎస్‌డీసీకి ఆమోదం, వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్‌ సిగ్నల్‌, ఇతర అంశాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఓకే చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.