యాప్నగరం

ఏపీ అసెంబ్లీ సమావేశాల గడువు పొడిగింపు

రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకోవాలనే పట్టుదలతో ఉన్న జగన్ సర్కారు అసెంబ్లీ సమావేశాలను ఒక రోజు పొడిగించింది. సెలక్ట్ కమిటీకి బిల్లును పంపొద్దనే ఉద్దేశంతో అడ్వొకేట్ జనరల్‌‌ను హుటాహుటిన పిలిపించింది.

Samayam Telugu 22 Jan 2020, 8:31 pm
ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఒక రోజు పొడిగించారు. మూడు రోజుల పాటు శాసనసభ సమావేశాలను నిర్వహించాలని తొలుత భావించారు. కానీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో సస్పెన్స్ కొనసాగుతుండటంతో.. సభను రేపటికి వాయిదా వేశారు. శాసనమండలిలో ఎలాగైనా మూడు రాజధానుల మీద బుధవారమే ఓటింగ్ నిర్వహించాలని జగన్ సర్కారు భావించింది. కానీ విపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు పదే పదే అడ్డు తలగడం, బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేయడంతో.. సభను గురువారానికి వాయిదా వేశారు.
Samayam Telugu ap assembly


బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతుండగా.. పంపాల్సిన అవసరం లేదని బుగ్గన, ఇతర మంత్రులు చెబుతున్నారు. మూడు రాజధానుల బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలక్ట్ కమిటీకి పంపొద్దనే ఉద్దేశంతో ఉన్న జగన్ సర్కారు.. హుటాహుటిన అడ్వొకేట్ జనరల్‌ను శాసనమండలికి పిలిపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.