యాప్నగరం

ప్రశాంత్ కిశోర్ కోసం సతీసమేతంగా ఉత్తరప్రదేశ్ వెళ్లిన సీఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశాంత్ కిశోర్ టీమ్‌లో కీలక వ్యక్తి అయిన రిషి రాజ్ సింగ్ వివాహానికి సతీసమేతంగా హాజరయ్యారు.

Samayam Telugu 16 Feb 2020, 11:48 pm
గత ఎన్నికల్లో తన గెలుపు కోసం వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిశోర్ (పీకే) కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోకు చేరుకున్నారు. ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్‌ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి వివాహానికి సీఎం జగన్ హాజరైనట్లు తెలుస్తోంది.
Samayam Telugu pk


లక్నో, గోమ్‌తీనగర్‌లోని హోటల్‌ తాజ్‌మహల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సీఎం జగన్ దంపతులు కొద్దిసేపు వారితో ముచ్చటించారు. అనంతరం అర్ధరాత్రి వారు తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.
కాగా, సీఏఏ, ఎన్ఆర్‌సీ విషయంలో సీఎం జగన్ వైఖరిపై పీకే ఆగ్రహంగా ఉన్నారంటూ ఇటీవల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పీకేను.. ఇటీవలే జేడీయూ ఉపాధ్యక్ష పదవి, పార్టీ నుంచి నితీష్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఢిల్లీలో ఆప్‌కు సైతం పీకే వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కోసం పని చేసిన పీకే టీమ్ కోసం సీఎం జగన్ సతీసమేతంగా వెళ్లడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.