యాప్నగరం

సైరాను కలవడం సంతోషంగా ఉంది.. సీఎం జగన్ పోస్ట్

మెగాస్టార్‌తో భేటీ తర్వాత ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. రాబోయే రోజుల్లోనూ మరింత ఆనందాన్ని, జ్ఞాపకాలను మనకు అందించాలని కోరుకుంటున్నాను అన్న సీఎం.

Samayam Telugu 14 Oct 2019, 9:40 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన చిరు.. జగన్‌కు పుష్పం గుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ముఖ్యమంత్రితో పాటూ ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. అనంతరం జగన్‌, చిరంజీవి దంపతులు కలిసి భోజనం చేశారు. తర్వాత ఇద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. చిరంజీవి తాను నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని జగన్‌ను కోరారు.
Samayam Telugu chiru.


Read Also: జగన్‌ను కలిసిన చిరు.. ఆయన ఫుల్ హ్యాపీస్!

మెగాస్టార్‌ భేటీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఫేస్‌బుక్ పేజ్‌లో చిరుతో దిగిన ఫోటోతో ఓ పోస్ట్ చేశారు. ‘సైరాతో సమావేశం సంతోషంగా ఉందని.. చిరంజీవి గారు రాబోయే రోజుల్లోనూ మరింత ఆనందాన్ని, జ్ఞాపకాలను మనకు అందించాలని కోరుకుంటున్నాను’ అన్నారు సీఎం జగన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.