యాప్నగరం

CBI కోర్టుకు హాజరైన సీఎం జగన్.. న్యాయస్థానానికి మళ్లీ స్పెషల్ రిక్వెస్ట్

జగన్ ఆస్తుల కేసును ఈ నెల 17కు వాయిదా వేసిన సీబీఐ కోర్టు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన ముఖ్యమంత్రి జగన్. తన తరపున సహ నిందితుడు కోర్టుకు హాజరవుతారన్న సీఎం.

Samayam Telugu 10 Jan 2020, 12:53 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసు విచారణ వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్లు అన్ని కలిపి విచారణ జరపాలన్న ఏపీ సీఎం జగన్ పిటిషన్‌పై వాదనలు పూర్తికాగా.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. విచారణ సమయంలో ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని జగన్ కోరారు.. తన తరపున సహ నిందితుడు హాజరవుతారని అడిగారు. తాను కీలకమైన పదవిలో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Samayam Telugu jagan court


అంతక ముందు ముఖ్యమంత్రి జగన్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాంపల్లి కోర్టుకు వెళ్లారు. ముఖ్యమంత్రి రావడంతో కోర్టు దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం జగన్‌తో పాటూ ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, రిటైర్డ్ ఐఏస్‌ శామ్యూల్‌ తదితరులు విచారణకు హాజరయ్యారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో.. పాలనాపరమైన అంశాలతో బిజీ అయ్యారు. దీంతో కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు ముందుగానే కోర్టుకు నివేదించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ అనుమతి తీసుకుంటున్నారు. కానీ కోర్టుకు వరుసగా హాజరు కాకపోవడంతో కేసు విచారణపై ప్రభావం చూపుతోందని సీబీఐ లాయర్లు అభ్యంతరాలు తెలిపారు.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ వాదనలపై స్పందించిన కోర్టు.. ప్రతిసారి మినహాయింపు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. దీంతో కోర్టుకు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.