యాప్నగరం

తిరుమల పర్యటనలో రాష్ట్రపతి కోవింద్.. సీఎం జగన్, గవర్నర్ ఘన స్వాగతం

రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకున్నారు.

Samayam Telugu 24 Nov 2020, 12:05 pm
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమల చేరుకున్నారు.. మరికొద్దిసేపట్లో ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. అంతకముందు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం తిరుమల చేరుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.
Samayam Telugu వైఎస్ జగన్


రాష్ట్రపతి పర్యటనకు వస్తుండటంతో తిరుపతి, తిరుమలలో టీటీడీ పకట్బందీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఏర్పాట్లను పరిశీలించారు. పద్మావతి విశ్రాంతి భవనం, రాంభగీచ వసతి భవనాలు, వరాహ స్వామి ఆలయం, శ్రీవారి ఆలయాల్లో ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. విధుల్లో ఉన్న సిబ్బందికి ముందస్తుగా కోవిడ్‌ పరీక్షలు చేయించారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.