మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపై ఏపీ అసెంబ్లీ సంతాపాన్ని తెలియజేసింది. కొద్దిరోజుల క్రితం మృతి చెందిన రోశయ్య సహా పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపై సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వల్లూరి నారాయణమూర్తి, వీవీఎస్ఎస్ చౌదరి, కడప ప్రభాకర్రెడ్డి, మంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి, గారపాటి సాంబశివరావు, టీఎన్ అనసూయమ్మ, పాటిల్ వేణుగోపాల్రెడ్డి, యల్లసిరి శ్రీనివాసులురెడ్డి, యడ్లపాటి వెంకట్రావు మృతికి సంతాపం తెలిపారు. వైఎస్, రోశయ్య ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విద్యార్థి నాయకుడి నుంచి సీఎం, గవర్నర్ వరకు వివిధ స్థాయుల్లో కొణిజేటి రోశయ్య ప్రజా జీవితంలో కొనసాగారని.. ఆయన ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద రోశయ్య మంత్రిగా పనిచేశారన్నారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనూ ఆర్థిక మంత్రిగా రోశయ్య కొనసాగారని గుర్తు చేశారు. వాళ్ల మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవన్నారు. రోశయ్య వంటి సీనియర్ రాజకీయ నేత లేకపోవడం బాధాకరమని.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం సూచనతో శాసనసభలో సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు.
మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య డిసెంబర్లో కన్నుమూశారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టకపోవడంపై విమర్శలు వచ్చాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటూ మిగిలిన పార్టీలు, ఆర్యవైశ్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రోశయ్య వంటి సీనియర్ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రికి సంతాప తీర్మానం పెట్టకపోవడం విచారకరమన్నారు. దీంతో ప్రభుత్వం గురువారం సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనూ ఆర్థిక మంత్రిగా రోశయ్య కొనసాగారని గుర్తు చేశారు. వాళ్ల మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవన్నారు. రోశయ్య వంటి సీనియర్ రాజకీయ నేత లేకపోవడం బాధాకరమని.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం సూచనతో శాసనసభలో సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు.
మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య డిసెంబర్లో కన్నుమూశారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టకపోవడంపై విమర్శలు వచ్చాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటూ మిగిలిన పార్టీలు, ఆర్యవైశ్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రోశయ్య వంటి సీనియర్ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రికి సంతాప తీర్మానం పెట్టకపోవడం విచారకరమన్నారు. దీంతో ప్రభుత్వం గురువారం సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.