యాప్నగరం

పెళ్లి వేడుకలో వైఎస్ జగన్.. రాజమండ్రి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన సీఎం

వైఎస్ఆర్సీపీ రాజమండ్రి నియోజకవర్గ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం కుమార్తె వివాహ వేడుకలో సీఎం జగన్ పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదించారు.

Samayam Telugu 9 Oct 2019, 1:56 pm
అధికారులతో సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం వైఎస్ జగన్ బుధవారం వివాహ వేడుకలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం రాజమండ్రి వెళ్లిన సీఎం.. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సమన్వయకర్త శివరామ సుబ్రహ్మణ్యం కుమార్తె అమృతవల్లి వివాహ వేడుకలో పాల్గొన్నారు. మంజీరా ఫంక్షన్‌ హాల్లో జరిగిన అమృతవల్లి, రంగనాథ్ వివాహ వేడుకలకు హాజరైన జగన్.. వధూవరులను ఆశీర్వదించారు. సీఎంతోపాటు మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పినిపే విశ్వరూప్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఎంపీ భరత్‌, కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా తదితరులు వధూవరులను ఆశీర్వదించారు.
Samayam Telugu rajamunday marriage jagan.


హోం మంత్రి మేకతోటి సుచరిత కుమార్తె రిషిక వివాహం కూడా బుధవారమే జరిగింది. సెయింట్ ఆన్స్ ఎడ్యుకేషనల్ గ్రూప్‌ అధినేత అద్దంకి విజయ్ కుమార్ కుమారుడు దీపక్ కుమార్‌, రిషిక వివాహం తణుకులోని బెల్‌ వెదర్‌ స్కూల్‌ ఆవరణలో జరిగింది.

గురువారం ఉదయం 9.11 గంటలకు సుచరిత కుమార్తె వివాహం జరగ్గా.. శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు, మంగళగరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పక్కన ఉన్న సీకే కన్వెన్షన్‌లో రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్‌లో సీఎం జగన్‌తోపాటు మంత్రులు, అధికారులు, రాజకీయ నేతలు పాల్గొనే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.