యాప్నగరం

పొగాకు రైతుల సమస్యలు.. సీఎం జగన్ కీలక నిర్ణయాలు

మార్కెట్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిర్ణయించింది.. దీనికి సంబంధించి ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయనున్నారు. పొగాకు కనీస ధరల్ని ప్రకటించనున్నారు.

Samayam Telugu 18 Jun 2020, 4:54 pm
పొగాకు రైతుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్. రైతుల్ని ఆదుకునేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మార్కెట్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిర్ణయించింది.. దీనికి సంబంధించి ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయనున్నారు. పొగాకు కనీస ధరల్ని ప్రకటించనున్నారు.. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే వేలం నిర్వహించనున్నారు.
Samayam Telugu సీఎం జగన్


వేలం జరిగే అన్ని రోజుల్లో లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు, కంపెనీ నియమాల ప్రకారం తప్పనిసరిగా పాల్గొనాలని, కొనుగోళ్లు చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనగోళ్లు జరపాలని.. పొగాకు కొనుగోలు ప్రక్రియలో పాల్గొనని వ్యాపారులు, కంపెనీలపై వేటు వేయాలని నిర్ణయించారు. వారి లైసెన్స్‌లు రద్దు చేయాలని రద్దు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. పొగాకు రైతుల సమస్యలపై ఫోకస్ పెట్టిన సీఎం.. ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.