యాప్నగరం

ఇది ఎలాంటి విజయమంటే.. కేజ్రీవాల్‌పై సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిందని పేర్కొన్నారు.

Samayam Telugu 11 Feb 2020, 3:14 pm
ఢిల్లీలో వరుసగా మూడో సారి అఖండ విజయం సాధించిన అర్వింద్ కేజ్రీవాల్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తున్నట్లు ఫలితాల సరళి ఉండటంతో పూర్తి ఫలితాలు వెలువడకముందే సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Samayam Telugu jagan, kejriwal


ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి, అర్వింద్ కేజ్రీవాల్‌కు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా విజయవంతమైన పాలన అందించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్‌కు వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోరే ప్రస్తుత ఎలక్షన్లలో కేజ్రీవాల్‌కు సైతం పని చేశారు. ఈ నేపథ్యంలోనే అందరి సీఎంల కంటే ముందుగా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.