యాప్నగరం

జగన్ సర్కార్ ప్రజాభిప్రాయసేకరణ.. ఆ ఛాన్స్ జనాలకే, వివరాలివే

ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నూతన విధానం రూపొందించాలని సూచించారు.

Samayam Telugu 20 Oct 2020, 9:10 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాభిప్రాయసేకరణకు సిద్ధమయ్యారు. నూతన ఇసుక విధానంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌‌ ఆదేశించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నూతన ఇసుక విధానం రూపొందించాలని సూచించారు. నూతన ఇసుక విధానంపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు.
Samayam Telugu సీఎం జగన్


ఇసుక విధానం ఖరారు చేసే ముందు పత్రికా ప్రకటన ఇచ్చి ప్రజల సూచనలు, సలహాలు పొందాలన్నారు సీఎం. ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని.. పూర్తి పారదర్శక విధానం ఉండాలన్నారు. ధర కూడా అందుబాటులో ఉండేలా.. సరఫరాలో సమర్థతను పెంచాలన్నారు. నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలని.. ఎవరికి వారు రీచ్‌కు వచ్చి నిబంధనల మేరకు ఇసుక తీసుకెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. కాంట్రాక్టర్‌ స్టాండ్‌ బై రవాణా సదుపాయం కూడా కల్పించాలి అన్నారు. నియోజకవర్గంలో నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదని.. ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల వారి ఇళ్లకు టోకెన్లు ఇచ్చి, సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలని చెప్పారు.

చలాన కట్టి, ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా ఉండాలన్నారు. ఏ రేటుకు అమ్మాలి? అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారించాలని.. అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్మితే ఎస్‌ఈబీ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) రంగంలోకి దిగుతుంది. స్థానికంగా ఉన్న వారికి ఇసుక అవసరమైతే, వారికి కూడా కూపన్లు ఇచ్చి.. సబ్సిడీ ధరకు ఇసుక సరఫరా చేయొచ్చన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని పరిశీలించాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.