యాప్నగరం

Ysr Jayanthi: మరణం లేని మహానేత.. సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్

ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే అంటూ ఎమోషనల్ ట్వీట్.

Samayam Telugu 8 Jul 2020, 9:37 am
నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సేవల్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను చేపట్టారు. తన తండ్రి వైఎస్ జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘నాన్న గారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే. రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది’అన్నారు సీఎం.
Samayam Telugu సీఎం జగన్


Read Also:
వైఎస్‌కు సీఎం జగన్ ఘన నివాళి.. ‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’ పుస్తకం ఆవిష్కరణ

జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయ వైఎస్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ దగ్గర పుష్క గుచ్చం ఉంచి స్మరించుకున్నారు.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎంతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆ మహానేతకు నివాళులు అర్పించారు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.