యాప్నగరం

జెరూసలేంలో జగన్.. ధ్యాసంతా రాష్ట్రంపైనే, అధికారులతో ఆరా..

Godavari Floods | జెరూసలేం పర్యటనలో ఉన్న సీఎం జగన్ గోదావరి జిల్లాల్లో పరిస్థితులను ఆరా తీశారు. గోదావరి వరదలపై సమాచారం కోరారు. అధికారులు ఆయనకు ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నారు.

Samayam Telugu 3 Aug 2019, 7:50 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెరూసలేం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కుటుంబంతో కలిసి ఆయన వ్యక్తిగత పర్యటనలో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పరిస్థితులపై నిత్యం ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎగువన ఉన్న తెలంగాణ, మహారాష్ట్రల్లోనూ వర్షాలకు కురుస్తుండటంతో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో గోదావరి వరద ఉద్ధృతిపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు.
Samayam Telugu jagan in jerusalem


ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై జగన్ సమాచారం కోరారు. సీఎంవో అధికారులు ఆయనకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని వివరించారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నారు. సీఎం జగన్ అధికార యంత్రాంగం చేపడుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లూ చేయాలని ఆదేశించారు.

Read Also: గోదావరి ఉగ్రరూపం.. నీట మునిగిన తీరప్రాంత గ్రామాలు

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ముంపు గ్రామాల్లోని ప్రజలకు జాప్యం లేకుండా నిత్యావసర సామగ్రి అందించాలన్నారు. ముంపు బాధితులకు పాతిక కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.