యాప్నగరం

KIA Motors‌ కొత్త కారు ప్రారంభోత్సవానికి జగన్ దూరం?

వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనను మరో రోజును పొడిగించుకున్నారు. దీంతో సీఎం అనంతపురం, కడప జిల్లాల పర్యటన వాయిదా పడింది. కియా మోటార్స్ ప్రారంభోత్సవానికి కూడా జగన్ దూరమైనట్టేనని భావిస్తున్నారు.

Samayam Telugu 7 Aug 2019, 6:41 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప, అనంతపురం జిల్లాల పర్యటన వాయిదా పడింది. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మరో రోజును పొడిగించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆగష్టు 8కి బదులుగా.. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జగన్ సీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా ఆగస్టు 8న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా.. పులివెందులలో వివేకానంద రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని భావించారు. కానీ జగన్ ఢిల్లీ పర్యటనను పొడిగించుకోవడంతో.. వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణను సెప్టెంబర్ 2కి వాయిదా వేశారు. ఆ రోజు వైఎస్ వర్ధంతి కూడా గమనార్హం.
Samayam Telugu jagan with kia.


అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ తొలి కారును సీఎం జగన్ సమక్షంలో గురువారం మార్కెట్లోకి లాంచ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే కియా ప్రతినిధులు సీఎంను కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్ కూడా అంగీకరించారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో సీఎం ‘అనంత’ పర్యటన వాయిదా పడింది. కియా మోటార్స్‌ తొలి కారును గురువారమే లాంచ్ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బుధవారం రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తదితరులను కలిశారు. వరుస భేటీలతో జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.