యాప్నగరం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు మరో కీలక పదవి.. అధికారుల ఉత్తర్వులు, వివరాలు ఇవే

ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. తాజాగా జగన్‌కు మరో పదవి వచ్చినట్లు అయ్యింది. పరిపాలనాపరమైన నిబంధనల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఈ పదవిని అప్పగించారు.

Samayam Telugu 29 Aug 2020, 4:07 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరో పదవి ఏంటని ఆశ్చర్యపోతున్నారా. మీరు వింటున్న నిజమే.. సీఎంకు మరో పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ బోర్డు, ఎగ్జి‌క్యూటివ్ క‌మిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Samayam Telugu సీఎం జగన్‌కు మరో పదవి


Also Read: యూ ట్యూబ్ ఛానల్‌పై సీఐడీకి వైసీపీ ఎంపీ ఫిర్యాదు

అలాగే వీరితో పాటు వివిధ శాఖలకు చెందిన 11 మంది ముఖ్యకార్యదర్శులను, ఉన్నతాధికారులను సభ్యులుగా పేర్కొంటూ ఆదేశాలు వచ్చాయి. ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ఛైర్మన్‌గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించారు. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. తాజాగా జగన్‌కు మరో పదవి వచ్చినట్లు అయ్యింది. పరిపాలనాపరమైన నిబంధనల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఈ పదవిని అప్పగించారు. ముఖ్యమంత్రి పదవితో పాటూ పలు శాఖల బాధ్యతలు చూస్తున్న సీఎంకు మరో పదవి దక్కింది.

Read Also: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి సరికొత్త వ్యూహం.. ప్లాన్ సక్సెస్

Also Read: స్వామీజీ అనుభవించినా అందుకోసమే.. కూతురి నోర్మూయించి కన్నతల్లి నీచం.. రోజూ రాత్రి పంపించి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.