యాప్నగరం

జగన్ కీలక నిర్ణయం.. మంత్రి మేకపాటికి మరికొన్ని శాఖలు

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అదనపు బాధ్యతలు.. మరో రెండు శాఖల్ని అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి గౌతమ్.

Samayam Telugu 25 Jan 2020, 9:09 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అదనంగా మరికొన్ని శాఖల్ని కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, జౌళి, ఐటీ శాఖల బాధ్యతల్ని నిర్వహిస్తున్న మేకపాటికి.. ఇప్పుడు అదనంగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖలను కేటాయించారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Samayam Telugu mekapati


మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. తనకు అదనపు బాధ్యతల్ని అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ద్వారా ప్రభుత్వంపై యువతకు ఉన్న విశ్వాసాన్ని పెంచేలా పనిచేస్తాను అన్నారు. ఉపాధి, నైపుణ్య శిక్షణలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర యువత ఆలోచనలు ప్రతిబింబించేలా ముందుకువెళతానని చెప్పారు మంత్రి. కోర్సులను రాష్ట్ర యువతకు అందించి.. వల్డ్ క్లాస్ వర్క్ ఫోర్స్ ని తయారు చేయడానికి కృషిచేస్తానన్నారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖలు కూడా పరిశ్రమలకు అనుబంధం కావడంతో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కింది. గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి.. ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.. కానీ ఆయన 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. గౌతమ్ రాజమోహన్‌రెడ్డి రాజకీయ వారసుడిగా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.