యాప్నగరం

పులివెందులైనా.. అమరావతిలోనైనా ఒకేలా ఉండాలి.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనం నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 18 Jan 2020, 11:00 pm
పేదలు విద్యకు దూరం కాకూడదని జగన్ సర్కార్ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టింది. పేద తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఇప్పుడు ఆ పిల్లలకు పౌష్టికాహారం అందించడంపై దృష్టి సారించింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో మధ్యాహ్న భోజన మెనూలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు.
Samayam Telugu jagan1 (3).


అందులో భాగంగా శనివారం విద్యాశాఖపై జరిగిన సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలో నాణ్యత అన్ని చోట్లా ఒకేలా ఉండాలన్నారు. పులివెందులలో భోజనం చేసినా.. అమరావతిలో తిన్నా రుచి మారడానికి వీల్లేదని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఆయాలకు ఇచ్చే రూ.3000 వేతనంతో సహా అన్ని చెల్లింపులు గ్రీన్‌ ఛానెల్‌లోనే జరగాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Also Read: వీడియో: రయ్‌మంటూ బైక్‌పై దూసుకెళ్లిన ఎమ్మెల్యే రోజా.. పుత్తూరు వీధుల్లో హల్‌చల్

మధ్యాహ్న భోజనం నాణ్యత తనిఖీకి నాలుగంచెల విధానం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
నాణ్యత తనిఖీ, ఫీడ్‌ బ్యాక్‌ కోసం పేరెంట్స్‌ కమిటీ ఏర్పాటు చేసి.. అందులో ముగ్గురు తల్లులు, పాఠశాల హెచ్‌ఎం సభ్యులుగా ఉండేలా చూడాలని సూచించారు. కమిటీ పిల్లలతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. రెండో దశలో గ్రామ సచివాలయాలు, మూడో స్ధాయిలో ఎస్‌హెచ్‌‌జీ గ్రూపులు, నాలుగో దశలో సెర్ఫ్‌ లేదా మరో సంస్థకు తనిఖీ బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆదేశించారు.

ఇక ఆ తనిఖీల మానిటరింగ్‌ బాధ్యతలను ఆర్డీవోకు అప్పగించారు. నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం కోసం ఏడాదికి రూ.1300 కోట్లు ఖర్చు పెడుతున్నామన్న సీఎం.. క్వాలిటీ, ఫుడ్ సేఫ్టీ కూడా చూడాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం కోసం మొబైల్‌ యాప్‌ రూపొందించనున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఆర్టిఫీసియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఈ యాప్‌ పనిచేస్తుందన్నారు. నాణ్యతో కూడిన మధ్యాహ్న భోజన కార్యక్రమం ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

Read Also: ఎకరానికి రూ.10 కోట్లు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.