యాప్నగరం

కృష్ణా జిల్లాలో మా మేనత్తని ఇచ్చాం.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కృష్ణా జిల్లాతో మాకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ జిల్లా ప్రజలు తమపై ప్రేమ చూపించారన్న సీఎం.. తనకు కోపం ఉంటే లెజిస్లేచర్ క్యాపిటల్ ఎందుకు పెడతామని ఆయన ప్రశ్నించారు.

Samayam Telugu 20 Jan 2020, 10:43 pm
ఏపీకి మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకి పిల్లనిచ్చిన అత్తగారి ఊరు నిమ్మకూరు అని.. అలాగే మా మేనత్తని అదే జిల్లాలోని మైలవరం పరిధిలోని గణపవరం ఇచ్చామని.. కృష్ణా జిల్లా కూడా నాదే అని జగన్ అన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు కూడా తన వాళ్లేనని జగన్ వ్యాఖ్యానించారు.
Samayam Telugu jagan 5


అలాగే మా కుటుంబానికి రాజ్, యువరాజ్ థియేటర్లు కూడా ఇక్కడే ఉన్నాయని.. కృష్ణా జిల్లాతో మాకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని సీఎం అన్నారు. ఈ జిల్లా ప్రజలు తమపై ప్రేమ చూపించారని జగన్ వ్యాఖ్యానించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 33 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. గత ఎన్నికల్లో 29 మంది వైసీపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించారన్నారు.

Also Read: రణరంగంగా అసెంబ్లీ.. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

తనపై మంచి అభిప్రాయం ఉంది కాబట్టే టీడీపీ నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయాలకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉందన్నారు. అలాగే కేవలం 8 కిలోమీటర్ల పరిధిలోనే అభివృద్ధి చేయాలనుకోవడం తగదని.. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి మహానగరం అవడం ఖాయమని.. అయితే కొంత సమయం పడుతుందన్నారు.

అమరావతిపై కోపం ఉంటే లెజిస్లేచర్ క్యాపిటల్ ఎందుకు పెడతామని వైఎస్ జగన్ అన్నారు. విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల పట్టణాల్లో వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని.. వందల కోట్లు ఖర్చు పెడితే నగరాలుగా అభివృద్ధి చెందుతాయని జగన్ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.