యాప్నగరం

దేశంలోనే తొలిసారిగా.. ఆ ఘనత మనకే దక్కింది: జగన్

'దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిర్ణయాలు తీసుకున్నాం.. మంచి ఫలితాలు వస్తున్నాయి. వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.. అందరూ సహకరించాలి' అన్న ముఖ్యమంత్రి జగన్.

Samayam Telugu 25 Sep 2019, 6:10 pm
పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌‌పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం.. వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అలాగే విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నామని.. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ వంటి నిర్ణయాల ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రం ఇలాంటి విప్లవాత్మకమైన చర్యలు చేపట్టలేదని.. ఆ ఘనత మన ఏపీకి దక్కుతుందన్నారు. ఏ రాష్ట్రంలో కూడా జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌టెండరింగ్‌ విధానాలు లేవన్నారు.
Samayam Telugu ys jagan


Read Also: ‘పోలవరంపైకి చైనా 'మేఘా'లు.. రివర్స్ టెండరింగ్ అసలు కథ’

పోలవరం పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ ద్వారా రూ.782 కోట్లు ప్రజలధనాన్ని ఆదా చేశామన్నారు జగన్. రూ.100 కోట్లు దాటిన ఏ టెండర్‌నైనా జడ్జి దృష్టికి తీసుకెళ్తున్నాం అని.. పారదర్శక విధానాల్లో జ్యుడిషియల్‌ ప్రివ్యూ అత్యుత్తమం అన్నారు. ఏ రాష్ట్రం కూడా రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేయడం లేదన్నారు. పారదర్శక విధానాల్లో న్యాయ సమీక్షే అత్యుత్తమమైనదని అభిప్రాయపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి.

పీపీఏల విషయంలో విప్లవాత్మక విధానాలు చేపట్టాం అంటున్నారు ముఖ్యమంత్రి. అధికారంలోకి రాగానే విద్యుత్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తే.. డిస్కంలపై రూ.20వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారని.. 13 నెలలుగా చెల్లింపులు లేవని అన్నారని.. అధిక ధరకు చేసుకున్న పీపీఏలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు బతికి బట్టకట్టవు అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువుగా ఉన్నాయని.. పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేసే పరిస్థితి ఉందన్నారు. పరిశ్రమలకు ఇచ్చే కరెంటు ఛార్జీలను ఇంకా పెంచే అవకాశం కూడా లేదన్నారు. విద్యుత్‌ రంగంలో పరిస్థితులను సరిద్దిడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. విద్యుత్‌రంగం పునరుద్దరణకు మీ అందరి సహకారం కావాలి అని జగన్ కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.