యాప్నగరం

'నాలో.. నాతో వైఎస్సార్‌' ఆవిష్కరణ.. వైఎస్ గురించి తెలియని ఎన్నో విషయాలు

వైఎస్‌లో చూసిన గొప్పగుణం.. 37 ఏళ్ల సాహచర్యంలో ఆయన గురించి నేను తెలుసుకున్న విషయాల గురించి రాయాలనిపించింది అన్నారు విజయమ్మ. ఆయనలోని మూర్తిభవించిన మానవత్వం​, ఆయన మాటకిచ్చే విలువ నలుగురికి తెలియజెప్పాలనిపించిందని భావోద్వేగానికి గురయ్యారు.

Samayam Telugu 8 Jul 2020, 10:40 am
దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజమమ్మ రాసిన "నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. బయటి ప్రపంచానికి నాన్న గొప్ప నాయకుడిగా అందరికీ పరిచయం.. అమ్మ ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన సుదీర్ఘ ప్రయాణంలో చూసిన విధానాన్ని పుక్తకరూపంలో తీసుకొచ్చారని.. ఇది ఒక మంచి పుస్తకం అన్నారు. ‘నాన్న జయంతి రోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’ అన్నారు వైఎస్ జగన్. ఈ సందర్భంలో జగన్ తన తల్లి విజయమ్మను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు.
Samayam Telugu విజయమ్మ పుస్తకం


వైఎస్‌లో చూసిన గొప్పగుణం.. 37 ఏళ్ల సాహచర్యంలో ఆయన గురించి నేను తెలుసుకున్న విషయాల గురించి రాయాలనిపించింది అన్నారు విజయమ్మ. ఆయనలోని మూర్తిభవించిన మానవత్వం, ఆయన మాటకిచ్చే విలువ నలుగురికి తెలియజెప్పాలనిపించింది అన్నారు. ఆయన ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చారని.. ఎంతో మంది అది తమకిచ్చిన భాగ్యం అనుకుంటానని.. ప్రతి ఒక్కరూ ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

అంతకముందు వైఎస్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ దగ్గర పుష్ప గుచ్చం ఉంచి స్మరించుకున్నారు.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎంతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆ మహానేతకు నివాళులు అర్పించారు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.