యాప్నగరం

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక తోక జాడిస్తే కట్

ఇసుక విషయంలో రాజీనే లేదంటున్న జగన్ సర్కార్.. టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభం. ఇసుక విషయంలో అవినీతి జరిగితే నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చేలా ఏర్పాట్లు. టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి.

Samayam Telugu 18 Nov 2019, 12:52 pm
ఇసుక అక్రమార్కులపై కొరడా ఝుళిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. కొత్త పాలసీ అమలుతో పాటూ ఇసుక అక్రమంగా రవాణా చేసేవారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇసుక అక్రమ రవాణా, నిల్వ, అధిక ధరల విక్రయ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టారు. ఇసుక రవాణాలో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు 14500 టోల్‌ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ఈ నంబర్ ద్వారా అధికారులతో సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ కాల్‌ సెంటర్‌ ఉద్యోగులకు కొన్ని సూచనలు చేశారు.
Samayam Telugu jagan


Read Also: జగన్ ఆ తప్పు తెలుసుకున్నారు.. వారికి ధన్యవాదాలు: పవన్ ఆసక్తికర ట్వీట్

ఇసుక విషయంలో రాజీనే లేదని చెబుతున్న ప్రభుత్వం.. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని చెబుతోంది. ఇప్పటికే గత బుధవారం జరిగిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినా.. అధిక ధరలకు అమ్మినా.. రెండేళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. కేబినెట్‌లో ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కూడా ప్రారంభించారు.

టోల్ ఫ్రీ నంబర్ మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న వారోత్సవాలను ప్రారంభించారు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక స్టాక్ పాయింట్లను ప్రారంభించారు. ఇక నదుల్లో వరద తగ్గుముఖం పడటంతో ఇసుక అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. త్వరలోనే అన్ని సమస్యలు తీరిపోతాయంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.