యాప్నగరం

మరో పథకానికి జగన్ సర్కార్ శ్రీకారం.. వారికి నెలకు రూ.5వేలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో దూసుకెళుతున్నారు. పాదయాత్ర, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నారు. తాజాగా లాయర్లకు సంబంధించిన వైఎస్సార్‌ లా నేస్తం పథకానికి శ్రీకారం చుట్టారు. జూనియర్‌ లాయర్లకు ఆర్థిక సాయం అందజేసే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. లబ్ధిదారులైన లాయర్ల బ్యాంకు అకౌంట్లలోకి నగదు జమ చేశారు. లా నేస్తం పథకం కింద జూనియర్‌ లాయర్లకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ సమయంలో మూడేళ్ల పాటు అందిస్తారు.

Samayam Telugu 4 Dec 2019, 8:25 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో దూసుకెళుతున్నారు. పాదయాత్ర, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నారు. తాజాగా లాయర్లకు సంబంధించిన వైఎస్సార్‌ లా నేస్తం పథకానికి శ్రీకారం చుట్టారు. జూనియర్‌ లాయర్లకు ఆర్థిక సాయం అందజేసే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. లబ్ధిదారులైన లాయర్ల బ్యాంకు అకౌంట్లలోకి నగదు జమ చేశారు. లా నేస్తం పథకం కింద జూనియర్‌ లాయర్లకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ సమయంలో మూడేళ్ల పాటు అందిస్తారు.
Samayam Telugu ap cm ys jagan launches ysr law nestham scheme
మరో పథకానికి జగన్ సర్కార్ శ్రీకారం.. వారికి నెలకు రూ.5వేలు


జగన్ చేతుల మీదుగా పథకం ప్రారంభం

ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్‌కు లాయర్లు ధన్యవాదాలు తెలిపారు. అలాగే న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల చట్టంలో మార్పులు తీసుకొస్తుండడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్సార్‌ లా నేస్తం కింద అర్హులైన 1970 మంది జూనియర్‌ లాయర్లకు ఇవ్వాల్సిన స్టైఫండ్‌‌ను‌ప్రభుత్వం విడుదల చేసింది.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..

ఈ పథకానికి అర్హులు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లా డిగ్రీతో పాటు జనన ధృవీకరణ పత్రం, సీనియర్‌ న్యాయవాది ధృవీకరణతో బార్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ అయినట్లు అఫిడవిట్‌ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఆధార్‌ నంబర్‌ను పొందుపరచాలి.. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలియజేయాలి. 15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం ఉన్న సీనియర్‌ లాయర్లు,బార్‌ అసోసియేషన్‌ నుంచి ధృవీకరణ పత్రంతో ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి ఆరు నెలలకు జూనియర్‌ అడ్వకేట్స్‌ అఫిడవిట్‌ను సమర్పించాలి.

ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే

ఇక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకానికి అర్హులు.. దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి. జీవో జారీ చేసేనాటికి జూనియర్‌ న్యాయవాది 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.. జీవో జారీ అయ్యే నాటికి తొలి మూడేళ్ల ప్రాక్టీసు పూర్తి అయి ఉంటే అనర్హులు. జూనియర్‌ న్యాయవాది పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు.. నాన్‌ ప్రాక్టీస్ న్యాయవాదులు అనర్హులు. వైఎస్సార్‌ లా నేస్తం‌కు దరఖాస్తు చేసుకోవాలంటే లా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి.. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసైనా ఉండాలి. దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షన్‌ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.

ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి

న్యాయవాద చట్టం 1961 సెక్షన్‌ 22 ప్రకారం రోల్‌లో నమోదైన తొలి మూడేళ్ల ప్రాక్టీస్ సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. జీవో జారీ అయ్యే నాటికి జూనియర్‌ లాయర్లు ప్రాక్టీసు ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన మూడేళ్లకు స్టైఫండ్‌కు అర్హులు. ఒకవేళ న్యాయవాది వృత్తి నుంచి తప్పుకున్నా, మరో ఉద్యోగం వచ్చినా.. ఆ వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలి. బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకు వారి సర్టిఫికెట్లు బార్‌ కౌన్సిల్‌లో ఉంచాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.