యాప్నగరం

ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సీఎం వైఎస్ జగన్

Ys Jagan Delhi Tour లో ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ ఆవరణలో ఉన్న కార్యాలయంలో కలిశారు. మధ్యాహ్నం అమిత్ షాతో కూడా భేటీకానున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 17 Mar 2023, 12:10 pm

ప్రధానాంశాలు:

  • ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్
  • ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం
  • మధ్యాహ్నం అమిత్ షాతోనూ భేటీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ys Jagan Pm Modi Meet
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (Pm Narendra Modu)తో సమావేశం అయ్యారు. సీఎం వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌కు వచ్చారు. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు.. ప్రధాని, ఏపీ సీఎంల సమావేశం అరగంటకుపైగా సాగింది. విభజన హామీలు, సమస్యలు, పెండింగ్ నిధులపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)తో సీఎం జగన్ భేటీ కానున్నారు.
అనంతరం పలువురు కేంద్రమంత్రులతో కూడా సీఎం జగన్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం తిరిగి విజయవాడకు బయల్దేరనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. గన్నవరం నుంచి బయల్దేరి రాత్రి 7.30 గంటల సమయంలో హస్తినకు చేరుకున్నారు. వన్‌ జన్‌పథ్‌లో రాత్రి బస చేశారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.