యాప్నగరం

జగన్ ఢిల్లీ టూర్.. వెంకయ్య, గడ్కరీలతో సీఎం భేటీ

AP CM YS Jagan ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. బుధవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలను కలిశారు. గడ్కరీతో జగన్ గంటపాటు భేటీ అయ్యారు.

Samayam Telugu 7 Aug 2019, 3:44 pm
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిశారు. రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో ఉన్న వెంకయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన జగన్.. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలకు సంబంధించి పలు అంశాలను ఆయన చర్చించారు. జగన్‌తోపాటు వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు కూడా ఉపరాష్ట్రపతిని కలిశారు. ఈ విషయాన్ని ఆంధప్రదేశ్ సీఎం కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Samayam Telugu jj


ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు జాతీయ రహదారి ప్రాజెక్ట్‌లుపై వీరిద్దరూ గంటకుపైగా చర్చించారని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అనంతరం ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిసే అవకాశం ఉంది.
మంగళవారం ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్.. పార్లమెంట్ కార్యాలయంలో ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని ప్రధాని సీఎం కోరారు. ప్రధానికి వినతి పత్రం అందించిన ఆయన.. రాష్ట్రానికి నిధులు అందజేయాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.