యాప్నగరం

సీఎం జగన్ ఆస్తుల కేసులో బిగ్ ట్విస్ట్.. ఈడీ కేసుల్లో పేరు తొలగించాలంటూ..!

YS Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జగతి పబ్లికేషన్స్‌పై ఈడీ చార్జ్‌షీట్‌లో..!

Samayam Telugu 12 Oct 2021, 11:23 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. జగతి పబ్లికేషన్స్‌పై ఈడీ చార్జ్‌షీట్‌లో ఏపీ సీఎం జగన్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు లేవని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. జగతి పబ్లికేషన్స్‌ ఈడీ కేసులో సీఎం జగన్‌ పేరు తొలగించాలని కోర్టును కోరారు. జగన్‌ డిశ్చార్జి పిటిషన్‌పై సీబీఐ కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి.
Samayam Telugu వైఎస్ జగన్


సీఎం జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. దీంతో వాదనలు కొనసాగించేందుకు సీఎం జగన్‌ డిశ్చార్జి పిటిషన్‌పై విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మార్‌ కేసు దర్యాప్తుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వివరణ ఇచ్చింది. ఎమ్మార్‌ కేసులో నిందితులపై దర్యాప్తు పూర్తయిందని ఈడీ తెలిపింది.

అభియోగాల నమోదుపై గతేడాది జనవరిలో ఈడీ వాదనలు సమర్పించినందున.. నిందితుల తరఫున వాదనల కోసం విచారణను ఈ నెల 27వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. సీబీఐ ఎమ్మార్ కేసులో కోనేరు మధుకు సంబంధించి సమాచారం కోరుతూ విదేశాలకు పంపిన ఎల్‌ఓఆర్‌ వివరాలు తెలపాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జగతి పబ్లికేషన్స్‌పై ఈడీ చార్జ్‌షీట్‌లో సీఎం జగన్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు లేవని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. జగతి పబ్లికేషన్స్‌ ఈడీ కేసులో సీఎం జగన్‌ పేరు తొలగించాలని కోర్టును కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.