యాప్నగరం

YS Jagan: ఏపీ ఉపాధ్యాయులకు శుభవార్త.. సంవత్సరాల కల తీరబోతోంది!

YS Jagan Mohan Reddy: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పారు.

Samayam Telugu 10 Oct 2020, 9:04 pm
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శనివారం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉపాధ్యాయ బదిలీలకు ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫైలుపై శనివారం ఆయన సంతకం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో బదిలీల అంశంపై ఉత్తర్వులు వెలువడనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2020 ఫిబ్రవరి 29వ తేదీ నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు అని ప్రభుత్వం వెల్లడించింది.
Samayam Telugu ముఖ్యమంత్రి జగన్


వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల ప్రక్రియ చేపట్టబోతున్నారు. కాగా, టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న బదిలీల అంశంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.