యాప్నగరం

గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కీలకంగా చర్చించారు.

Samayam Telugu 6 Apr 2022, 7:13 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్ విస్తరణకు సంబంధించి విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ ఏర్పాటుపై గవర్నర్‌తో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించారు.
Samayam Telugu గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ


అలాగే, పాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటును సీఎం జగన్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వివరించారు. ఈ నెల 11వ తేదీన మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్‌కు సీఎం జగన్ తెలిపారు. అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌ను సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. ఇందుకు సంబంధించి నూతన మంత్రుల జాబితాను రెండు రోజుల్లో అందజేయనున్నట్లు వెల్లడించారు.

అంతకు ముందు రాజ్‌భవన్ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డికి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, గత వారం రోజులుగా సొంత రాష్ట్రం ఒడిశా, ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్‌ మంగళవారం రాత్రే అక్కడి నుంచి విజయవాడకు చేరకున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి వర్గ విస్తరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం 3 గంటలకు కేబినెట్‌ సమావేశం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.