యాప్నగరం

అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. అంతర్వేది సహా ఈ అంశాలపై చర్చ.. ఈ రాత్రి ఢిల్లీలోనే..!

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు.

Samayam Telugu 22 Sep 2020, 9:21 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అమిత్‌ షా నివాసంలో మంగళవారం సాయంత్రం సీఎం జగన్‌ ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, కోవిడ్‌ సహా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధుల అంశాలను అమిత్‌ షాకు సీఎం జగన్ వివరించారు. ఈ భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు సైతం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ రాజధాని విషయంలో ఇటీవల కేంద్ర హోంశాఖ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ల అంశంపైనా నేతలిద్దరూ చర్చించినట్లు సమాచారం.
Samayam Telugu అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్


మరీ ముఖ్యంగా అంతర్వేది రథం దగ్ధం ఘటన, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్‌ కుంభకోణాలపై అమిత్ షాకు సీఎం జగన్ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే వీటిపై సీబీఐ దర్యాప్తు అంశాన్ని సీఎం జగన్.. అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, పెండింగ్ అంశాలపై అమిత్ షాకు సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు.

సీఎం జగన్‌ వెంటన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి తదితరులు ఉన్నారు. ఈ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. అలాగే అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రోజు రాత్రి సీఎం జగన్‌ ఢిల్లీలోనే బస చేస్తారని తెలుస్తోంది. బుధవారం ఉదయం బయల్దేరి నేరుగా తిరుపతి చేరుకుంటారు. కాగా, వీలైతే ఈ రోజు రాత్రే ప్రధాని నరేంద్ర మోదీతో సైతం భేటీ అయ్యేందుకు సీఎం జగన్ ప్రత్నిస్తున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.