యాప్నగరం

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. ఆలయాభివృద్ధికి రూ. 70 కోట్లు!

విజయవాడ కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

Samayam Telugu 21 Oct 2020, 8:33 pm
దసరా మహోత్సవాల్లో భాగంగా బుధవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలను సమర్పించారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా దుర్గగుడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో జగన్‌కు ఘనస్వాగతం పలికారు.
Samayam Telugu విజయవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పిస్తున్న సీఎం జగన్

అనంతరం కొండమీదకు చేరుకున్న సీఎం జగన్‌ కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేస్తున్న సహాయక చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం పంచెకట్టులో, తలపాగా చుట్టి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్‌ వెంట మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు పార్థసారథి, వల్లభనేని వంశీ, అబ్బయ్య చౌదరి, దూలం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు దుర్గగుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు వెల్లడించారు. లడ్డూ పోటు, ఘాట్‌రోడ్‌ అభివృద్ధి, సోలార్‌ సిస్టంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం జగన్ నిధులు ప్రకటించారని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.