యాప్నగరం

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు సీఎం జగన్‌ ఫోన్ కాల్!

ఏబీఎన్- ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు.

Samayam Telugu 27 Apr 2021, 6:29 pm
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్‌ చేశారు. ఆర్కే సతీమణి వేమూరి కనకదుర్గ మృతి పట్ల సీఎం జగన్‌ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు రాధాకృష్ణను సీఎం జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు.
Samayam Telugu ఏబీఎన్ ఆర్కేకు సీఎం జగన్ ఫోన్ కాల్


గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) మంగళవారం కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఉద్యోగులు, జర్నలిస్టులు సంతాపం తెలియజేశారు. భార్య పార్థీవదేహాన్ని చూసి ఏబీఎన్ రాధాకృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనకదుర్గ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఈ కష్ట సమయంలో రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.