యాప్నగరం

టెన్త్ పేపర్ లీక్ చేసింది వాళ్లే.. బహిరంగ సభలో పేర్లు బయటపెట్టిన సీఎం జగన్

తిరుపతిలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. 0.85 లక్షల మంది విద్యార్థులకు 709 కోట్ల రూపాయలను విద్యార్థలు తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 5 May 2022, 2:31 pm
జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి డబ్బులు జమచేశారు. 10.85 లక్షల మంది విద్యార్థులకు 709 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చదువు అనేది ఒక దేశచరిత్రను మారుస్తుందని.. తల రాతలు మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడు చదువుకోవాలని విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా విద్యార్థులకు అనేక వసతులు అందుబాటులో తీసుకువచ్చామన్నారు. చదవులను మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి అని అన్నారు.
Samayam Telugu సీఎం జగన్ మోహన్ రెడ్డి


ఎవరైనా ఏదైనా దొంగతనం చేసుకోనిపోవచ్చు కానీ.. ఒక్క చదువును మాత్రం ఎవరూ దొంగతం చేయలేరని సీఎం జగన్ అన్నారు. దేవుడి దయతో జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి జగన్. టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చిందన్నారు. తాను పాదయాత్రలో ప్రజలు కష్టాలు స్వయంగా చూశానని అన్నారు. ఫీజులు కట్టేలేక ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించులేకపోయారని అన్నారు. పిల్లలకు చదువుకు దూరం కాకూడదే ఉద్దేశంతో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను.. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గమనించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.

అనంతరం రాష్ట్రం టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజ్ ఇష్యూపై సీఎం జగన్ స్పందించారు. విద్యా దీవెన పథకంపై దుష్ప్రచారం చేసేందుకు ప్రశ్నపత్రాలు లీక్ చేస్తున్నారని.. పరోక్షంగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ చేసింది రెండు నారాయణ స్కూల్స్, మూడు శ్రీచైతన్య స్కూల్స్ అని సభలో ముఖ్యమంత్రి పేర్లు బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో నారాయణ మంత్రిగా పనిచేశారని.. ఆయనకు సంబంధించిన స్కూళ్లు, కాలేజీల నుంచి ప్రశ్నపత్రాలను లీక్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నపత్రాలను ఫొటోలను తీసి వాట్సాప్‌లో షేర్ చేస్తూ.. వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

'వాళ్లే పేపర్లు లీక్ చేసి.. దొంగే దొంగ అన్నట్లుగా ప్రశ్నపత్రాలు లీక్ అంటూ డైవర్ట్ చేయడానికి నానా తంటాలు పడతారు. కారణం.. జగనన్న ఈరోజు విద్యాదీవెన కార్యక్రమం ప్రారంభించనున్నాడు. ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందోనని కడుపుమంట నుంచి కుళ్లు, కుతంత్రాలు ఏస్థాయి పోతున్నాయో ప్రజలు గమనించాలి..' అని సీఎం జగన్ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.