యాప్నగరం

మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు.. తిరుపతి రుయా, విజయవాడ ఘటనలపై సీఎం జగన్ సీరియస్

తిరుపతి రుయా, విజయవాడ ఆస్పత్రిలో అత్యాచార ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందన్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 27 Apr 2022, 5:33 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై తిరుపతి రుయా తరహా ఘటనలు పునరావృతం కావడానికి వీల్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్‌ డ్రైవర్ల మాఫియా.. ఓ నిరుపేద పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ క్రమంలో తిరుపతి రుయా ఘటనపై సీఎం జగన్‌ తీవ్రంగా స్పందించారు.
Samayam Telugu సీఎం జగన్


ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో బాధితులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా ఫిర్యాదు చేసేలా ఉండాలని స్పష్టం చేశారు. తిరుపతి రుయా, విజయవాడ ఆస్పత్రిలో అత్యాచారం వంటి ఒకట్రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

విజయవాడ ఆస్పత్రిలో ఓ యువతిపై జరిగిన ఘటన లాంటిది మరోసారి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనల పట్ల పోలీసుల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.