యాప్నగరం

లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్

లంచాలు తీసుకునే ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

Samayam Telugu 31 Mar 2022, 4:05 pm
ఆంధ్రప్రదేశ్‌లో లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూ సర్వే జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో దేశానికే రాష్ట్రం దిక్సూచిగా నిలవాలని సూచించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై గురువారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను సీఎం జగన్‌కు అధికారులు అందించారు. అలాగే సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్లను సీఎం జగన్‌ పరిశీలించారు.
Samayam Telugu సీఎం జగన్ సీరియస్


ఏప్రిల్‌ 5వ తేదీ కల్లా భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమవుతాయని, వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామని సీఎం జగన్‌కు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని.. అవినీతి, లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇది జరగాలని అధికారులకు సూచించారు.

అలాగే, ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలని.. తద్వారా స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయని వివరించారు. భూ యజమానులకు క్లియర్‌ టైటిల్స్‌ ఇచ్చేనాటికి.. దాదాపు వివాదాలు లేకుండా చూడాలన్నారు. న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేయాలన్నారు. సమగ్రంగా ఓ రోడ్‌మ్యాప్‌ను కూడా తయారు చేయాలని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.