యాప్నగరం

తన ఉద్యోగికి సీఎం జగన్ ఊహించని గిఫ్ట్.. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ..!

YS Jagan Attends Marriage: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యతో కలిసి తన కార్యాలయ ఉద్యోగి పెళ్లికి హాజరయ్యారు.

Samayam Telugu 5 Nov 2020, 6:53 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిరంతరం బిజీబిజీగా గడిపే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తన కార్యాలయంలో పనిచేసే వ్యక్తికి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. తన భార్య భారతితో కలిసి సీఎం జగన్ అతడి వివాహానికి హాజరై అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్‌ వివాహం గురువారం తాడేపల్లి సీఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంలో జరిగింది.
Samayam Telugu తన కార్యాలయ ఉద్యోగి వివాహానికి హాజరైన సీఎం జగన్ దంపతులు


ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సతీ సమేతంగా హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం జగన్, భారతి దంపతులు‌ ఆశ్వీరదించారు. సాధారణంగా ముఖ్యమంత్రి జగన్ వెంట చాలా ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రమే ఆయన భార్య వైఎస్ భారతి కనిపిస్తుంటుంటారు. గత రెండు రోజులుగా సీఎం జగన్ వైసీపీ ముఖ్య నాయకుల పిల్లల పెళ్లిళ్లకు హాజరైనప్పుడు కూడా ఆయన వెంట భారతి లేరు. అయితే తన కార్యాలయ ఉద్యోగి వివాహానికి మాత్రం సీఎం జగన్.. తన భార్యతో కలిసి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులతో పాటు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. తమ వివాహానికి ముఖ్యమంత్రి సతీసమేతంగా హాజరు కావడం పట్ల రవి ప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Don't Miss: బుట్టా రేణుకకు సీఎం జగన్ బంపరాఫర్: కష్టకాలంలో కీలక పదవి.. ఆ తప్పు మాఫీ!

Also Read: అమరావతి కేసులో టీడీపీకి షాక్.. వారికి సుప్రీం కోర్టు నోటీసులు!

Must Read: పోర్టు వచ్చేస్తోంది: ఏపీ ప్రజలకు శుభవార్త.. కేబినెట్‌లో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.