యాప్నగరం

సీబీఐ కోర్టుకు జగన్ డుమ్మా.! కారణం అదేనా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టు విచారణకు హాజరుకాలేదు. ఆ కేసులో నిందితులుగా ఉన్న విజయసాయి రెడ్డి, శ్రీలక్ష్మి కోర్టుకు హాజరయ్యారు. అధికారిక పర్యటనలో బిజీగా ఉన్నందున జగన్ హాజరుకాలేదని సమాచారం.

Samayam Telugu 6 Sep 2019, 2:47 pm
అక్రమాస్తుల కేసులో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు విచారణకు శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాలేదు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. చార్జిషీట్లపై విచారణ జరిపిన న్యాయస్థానం విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ 11 వతేదీకి వాయిదా పడింది.
Samayam Telugu pjimage (32)


Must Read : బిల్డప్‌లు వద్దు.. ఇవాళ కోర్టులో ఏం జరిగిందో చెప్పు.. విజయసాయిపై టీడీపీ ఎమ్మెల్సీ సెటైర్లు

ఏపీ సీఎంగా ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టుకు హాజరయ్యేందుకు బందోబస్తు, ప్రొటోకాల్‌ కోసం రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని కోర్టుకు విన్నవించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా అంత బాగా లేదని, బందోబస్తు ఖర్చుల భారం ఖజానాపై పడుతుందని తెలిపారు.

Also Read : జగన్ గారూ! టీటీడీ బోర్డులో 30 మంది సభ్యులా.. రహస్య అజెండా ఏమీ లేదుగా?

ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు తన తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. వ్యక్తిగతంగా తాను హాజరుకావాలని కోర్టు ఆదేశిస్తే.. అప్పుడు హాజరవుతానని కోర్టుకు విన్నవించారు. పరిపాలనకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉందని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్న కారణంగా తనను మినహాయించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.