మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బలిరెడ్డి సత్యారావుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. శనివారం విశాఖలోని మహారాణిపేటలో బలిరెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం.. ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సత్యారావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి.. సంతాపాన్ని తెలియజేశారు. బలిరెడ్డి సత్యారావు ప్రజలకు ఎనలేని సేవలందించారని..విశాఖ జిల్లాకు, ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి ఆయన మరణం తీరని లోటన్నారు. Read Also: వాకింగ్ చేస్తుండగా బైక్ ఢీ.. మాజీ మంత్రి దుర్మరణం
శుక్రవారం సాయంత్రం విశాఖ బీచ్ రోడ్లో వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని బైక్ వెనుక నుంచి వచ్చి సత్యారావును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యారావుకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే స్థానికులు దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అత్యవసర చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది.. తీవ్ర గాయాలు కావడంతో కన్నుమూశారు.
బలిరెడ్డి సత్యారావు విశాఖ జిల్లా చోడవరం నుంచి రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989, 1999లో వరుసగా గెలుపొందారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంత్రిగా కూడా పని చేశారు. 2004 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి.. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. 2004 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. చోడవరం నియోజకవర్గంలో సీనియర్ నేతగా వ్యవహరిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం విశాఖ బీచ్ రోడ్లో వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని బైక్ వెనుక నుంచి వచ్చి సత్యారావును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యారావుకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే స్థానికులు దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అత్యవసర చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది.. తీవ్ర గాయాలు కావడంతో కన్నుమూశారు.
బలిరెడ్డి సత్యారావు విశాఖ జిల్లా చోడవరం నుంచి రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989, 1999లో వరుసగా గెలుపొందారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంత్రిగా కూడా పని చేశారు. 2004 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి.. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. 2004 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. చోడవరం నియోజకవర్గంలో సీనియర్ నేతగా వ్యవహరిస్తున్నారు.